జ్వరం సర్వే కార్యక్రమం

Published: Thursday July 15, 2021
మధిర, జులై 14, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ 7వ వార్డు లో ఫీవర్ సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ గారు మళ్ళీ జ్వరం సర్వే చేపట్టాలి నిర్ణయించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ లత జయాకర్, మున్సిపల్ కమీషనర్ రమాదేవి గార్ల నేతృత్వంలో 7వ వార్డు కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ ఆధ్వర్యంలో జ్వరం సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్బంగా కరోనా ఉధృతి ఇంకా వున్నది కావున ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి అని చెప్పడం జరిగింది. దోమలు తిరిగే ప్రదేశాలలో దోమల మందు పిచికారీ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మేడికొండ కిరణ్, మున్సిపల్ ఇంచార్జి వెంకట్, అంగన్వాడీ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆశ వర్కర్స్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.