సెస్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం.. వార్ వన్ సైడే... గెలుపు ఖరారే.. చొప్పదండి ఎమ్మెల్యే

Published: Thursday December 22, 2022

కొడిమ్యాల, డిసెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలంలో నల్లగొండ,తిప్పయిపల్లి గ్రామాల్లో సెస్ ఎన్నికల ప్రచారం చేసిన  సుంకె రవిశంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
సెస్  ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొట్టేపల్లి సుధాకర్ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి కొట్టె పెల్లి సుధాకర్ తో ఇంటింటికి తిరిగి రైతు సోదరులతో మాట్లాడి వినూత్న ప్రచారం నిర్వహించారు..
ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అంటేనే పనిచేసే పార్టీ అని అభివృద్ధి చేసే పార్టీ అని ప్రతినిత్యం ప్రజలతో ఉండే పార్టీ అని రైతాంగం సమస్యలు తీర్చడానికి గ్రామాల అభివృద్ధి చేయడానికి నిరంతరం నేను మీ వెన్నంటే ఉంటానని , ఉంటున్నామని అభివృద్ధి చేసె టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పునుగొటి కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనర్సింగారావు , ఏఎంసి చైర్మన్ కోరండ్ల నరేందర్ రెడ్డి,వైస్ పర్లపల్లి ప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, భారాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్,  కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ ఒల్లాల లింగాగౌడ్, తిప్పయిపల్లి‌, నల్లగొండ  యువ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.