లబ్ధిదారులకు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

Published: Wednesday June 29, 2022

బోనకల్ ,జూన్ 28 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు సిఫారసు మేరకు ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు చొరవతో మంగళవారం రావినూతల గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదుగా అందజేశారు. లబ్ధిదారులు నంచర్ల శోభారాణి 60000 వేల రూపాయలు, వీరపనేని భద్రమ్మ 20000 వేల రూపాయలు, అజ్మీరా చావలి 20000 వేల రూపాయలు, యనమద్ది వెంకాయమ్మ 60000 వేల రూపాయలు వీరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.