పారిశుద్ధ్య పర్యవేక్షణలో సర్పంచ్
Published: Thursday September 30, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో ఈరోజు సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ పర్యవేక్షణలో గులాబ్ తుఫాన్ కారణంగా కొన్ని ప్రదేశాలలో నీరు నిల్వ ఉండడం జరిగింది. గ్రామ ప్రజలుసీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియాబారిన పడకుండా గ్రామ ప్రజలు సురక్షితంగా ఉండాలని నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో దోమలు చేరకుండా లార్వా వృద్ధి చెందకుండా మల్టీపర్పస్ సిబ్బంది ద్వారా తి మొ పాస్ అనే మందును గ్రామంలో పిచికారి చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలోసర్పంచ్ నోముల వెంకట నరసమ్మ, వార్డ్ మెంబర్స్ మల్టీపర్పస్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
Share this on your social network: