గ్రామాభివృద్ధికి ప్రధాన వ్యవస్థ రోడ్డు సౌకర్యం

Published: Wednesday March 09, 2022
పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 08 మార్చి ప్రజాపాలన : గ్రామాభివృద్ధికి ప్రధాన వ్యవస్థ రోడ్డు సౌకర్యమని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అన్నారు. మంగళవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రోత్సాహంతో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ 5 లక్షల నిధులతో ఎస్సీ కాలనీలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి వార్డులో సిసి రోడ్ల నిర్మాణాన్ని అంచెలంచెలుగా చేపడుతామని వివరించారు. గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మండల ఉపాధ్యక్షులు డీ. అశోక్, గ్రామ కమిటీ అధ్యక్షులు జి. అశోక్, వార్డ్ మెంబర్స్ బాలేష్, అంజాత్, వికాస్, దేవయ్య, ఆనంద్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.