బెల్లంపల్లిలో తెరాస విజయోత్సవ సంబరాలు

Published: Monday November 07, 2022
బెల్లంపల్లి నవంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి: మునుగోడు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో తెరాస నాయకులు ఆదివారం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ భత్తుల సుదర్శన్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కారణమని, ఏ పార్టీకి లేని ఆదరణ తెరాస పార్టీకి ఉందని ఇక ముందు కూడా విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు.
అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు
ఈ కార్యక్రమంలో పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, పార్టీ అధ్యక్షులు,4వ వార్డు కౌన్సిలర్ బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, నీలి కృష్ణ, కే ,చంద్రశేఖర్, జిలకర వాసు, గోషిక రమేష్, తెరాస నాయకులు సూరం బానేష్, కెంశెట్టి శ్రీనివాస్, పోలు శ్రీనివాస్, గుడిమెట్ల సత్యనారాయణ, విద్యార్థి నాయకుడు బడికల శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.