బురాన్ పల్లిలో సిసి రోడ్లు మురికి కాలువల నిర్మాణం చేపట్టాలి

Published: Thursday January 12, 2023
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 11 జనవరి ప్రజాపాలన : జనవరి 18 నుండి ప్రారంభం కానున్న కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని బురాన్ పల్లి, అనుబంధ గ్రామం బురాన్ పల్లి తండాలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ మమత సాయికృష్ణాగౌడ్ అధ్యక్షతన మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి, ఎంపిపి కామిడి చంద్రకళ ఆధ్వర్యంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గల్లీ గల్లీ తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కంటి చూపు మందగించిన ప్రజల కోసం చారిత్రాత్మకమైన కంటి వెలుగు పథకం రెండో విడతను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో నూతన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు, పిచ్చిమొక్కలను తొలగించి, పల్లె ప్రగతిలో చేయలేని పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. గ్రామంలో అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. స్థంబాలకు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసి, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో, పంట పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామంలో మిషన్ భగీరథ నీటి ట్యాంక్ నిండిన ప్రతిసారి తగిన మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలని వెల్లడించారు. ప్రజలు మిషన్ భగీరథ మంచినీటిని త్రాగాలని, అందుకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే *మా ఇంటికి రండి* కార్యక్రమంలో భాగంగా  బురాన్ పల్లికి చెందిన  లబ్ధిదారునికి మంజూరైన *కళ్యాణ లక్ష్మి చెక్కును* వారి ఇంటికి స్వయంగా వెళ్లి  అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ గయాజ్, మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు రవీందర్, మండల యూత్ ప్రెసిడెంట్ కైల ఉపేందర్ రెడ్డి, మండల సర్పంచులు,   ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.