తెలంగాణ రైతు గోస మధిరలో బీజేపీ పోరు దీక్ష.

Published: Tuesday May 25, 2021

మధిర ప్రజాపాలన ప్రతినిధి : 23వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండించిన పంట ప్రభుత్వం సరిగా కొనుగోలు చెయ్యక ఎక్కడ ధాన్యం అక్కడ నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావంతో తడిసి నష్టం వాటిల్లుతుంది. వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు ముమ్మరంగా జరపాలని, అదేవిదంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని. తరుగుపేరుతో రైతులకు అన్యాయం చెయ్యవద్దని, వెంటనే రైతు బంధు ఇవ్వాలని, కరోనా నేపథ్యంలో రైతులను ప్రభుత్వం ఆడుకోవాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్చేస్తుంది. రైతులపై ప్రభుత్వనిర్లక్ష్య వైఖరికి నిరసిస్తూ రాష్ట్ర పార్టీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష కార్యక్రమం ఇంటివద్దనే దీక్ష చేపట్టాలని పిలుపు ఇవ్వటంతో ఈ రోజు 10 గంటల నుండి 1 గంట వరకు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలివేరు సాంబశివరావు జిల్లా కార్యవర్గ సభ్యులు కొంచెం కృష్ణారావువారి నివాసం లో దీక్ష చేపట్టారు.