*డాక్టర్ గీత చిత్త థామస్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ*

Published: Wednesday February 01, 2023

ప్రజాపాలన షాబాద్ =షాభాద్ మండల కేంద్రంలోని హోలీ స్పిరిట్ హైస్కూల్ లో బ్యాగులను పంపిణీ చేసిన షాబాద్ సమీపంలోని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత  చిత్త థామస్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో  వారి ప్రతినిధి తోంట శ్రీను షాభాద్ పట్టణంలోని హోలీ స్పిరిట్ హై స్కూల్  చదువుతున్న పేద విద్యార్థులకు 85/- బ్యాగ్స్ ఉచితంగా పంపిణి చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసించుటలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి ఇబ్బందులను దూరం చేయడానికి మా యొక్క చిన్ని సహాయం విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగినప్పుడే అన్ని రంగాలలో  అభివృద్ధి చెందుతారు విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యారాలు సిస్టర్ సంగీత  ఇతర సిబ్బంది హాజరై ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్  నీడ్ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు...