జిన్నారం మండలంలోని జాతీయ బ్యాంకు ఏర్పాటు చేయాలి.

Published: Monday May 24, 2021
జిన్నారం మండలంలోని జాతీయ బ్యాంక్ ఏర్పాటు చేయాలని మాల యువసేన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నీరుడి వీరస్వామి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిన్నారం మండలంలో జాతీయ బ్యాంకు పెట్టాలని గతంలో జిల్లా పాలనాధికారి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఉమ్మడి మండలంలో ఉన్నప్పుడు గుమ్మడిదల కు వెళ్లాలంటే కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు అందుకే జిన్నారం మండల కేంద్రంలో జాతీయ బ్యాంకు ఏర్పాటు చేయాలని మాల యువసేన జిల్లా అధ్యక్షులు నీరుడి వీరస్వామి అన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని మండల కేంద్రంలో జాతీయ బ్యాంకు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు..