యాదాద్రి భువనగిరి జిల్లా 9 జులై ప్రజాపాలన: వేల్పుపల్లి గ్రామ నిరుపేద ఐదు గురు మహిళలకు ఉచితంగ
Published: Monday July 11, 2022
తేదీ.08.07.2022 రోటరి క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ (ప్రతిపాదిత) మరియు డా.సుమంత్ కంటి ఆసుపత్రి భువనగిరి వారి సంయుక్త ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట, వేల్పుపల్లి గ్రామ నిరుపేద ఐదుగురు మహిళలకు ఉచితంగా కంటి శుక్లాల చికిత్సను నిర్వహించారు. డా.పిన్నపురెడ్డి సుమంత్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ సహకారంతో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో డా.ఎంపల్ల బుచ్చిరెడ్డి, ఛైర్మన్, మెంబెర్షిప్ ఎక్సెటెన్షన్ తెలంగాణ రీజియన్,అసిస్టెంట్ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి , ఫక్కీరు కొండల్ రెడ్డి కార్యదర్శి, మహమ్మద్ హనీఫ్ మెమన్ కోశాధికారి, ఆసుపత్రి సిబ్బంది, రోగుల సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: