ఓట్లు మావే...... సీట్లు మావే

Published: Friday March 12, 2021
మహబూబాబాద్ జిల్లా, మార్చి 11, ప్రజా పాలన ప్రతినిధి: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడు బహుజన ఐక్యవేదిక దళిత బహుజన పార్టీ కాన్షీరాం పౌండేషన్ శ్రమజీవి పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మేడి రమణ అను నాకు  మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని దంతాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల ప్రెస్మీట్లో డాక్టర్ మేడి రమణ గారు మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ తెలంగాణ స్టూడెంట్ యూత్ ఓయూ కేయూ జేఏసీ వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాది విప్లవాల పురిటిగడ్డ  వీర తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామం విద్యార్థి దశలోనే వామపక్ష భావజాలంతో విద్యార్థి యువజన నాయకుడు గా పనిచేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ లో డాక్టరేట్ ను పొంది ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడి విద్యారంగ సమస్యలు విద్యార్థుల సంక్షేమం విద్య వ్యవస్థ లోని మార్పుల కోసం నిరంతరం పోరాడుతూ విద్యార్థి నిరుద్యోగ పక్షాన నిలిచి బహుజన విద్యార్థి ఐక్యత కొరకు తెలంగాణ సాధన ఉద్యమంలో ఉద్యోగ విద్యార్థి జేఏసీల కీలకపాత్ర పోషించి ప్రజాస్వామ్య తెలంగాణ నిరుద్యోగ నిర్మూలన కొరకు పోరాటం చేస్తున్నాను నన్ను ఆదరించి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించిన నాకు అవకాశం కల్పిస్తే పట్టభద్రుల సంక్షేమ నిరుద్యోగ నిర్మూలన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అభివృద్ధి మహిళా రక్షణ ద్వే యం గా పోరాడుతానని పట్టభద్రుల సోదరీ సోదరీమణులకు హామీ ఇస్తున్నాను అని ఆయన అన్నారు: ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ యాదవ్ బచ్చలకూర జానయ్య యాకన్న మధు ఉ జాను మేడి సైజులు తదితరులు పాల్గొన్నారు