ప్రజలందరినీ చైతన్యం చేసిన గొప్ప పోరాటయోధుడు కాన్షీరామ్
Published: Sunday October 10, 2021
బహుజన సమాజ్ పార్టీ మండలం అధ్యక్షుడు బోడ ప్రశాంత్
మల్లాపూర్, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : బహుజన సమాజ్ పార్టీ మల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మన్యం కాన్షీరామ్ 15వ వర్థంతిని శనివారం భారత మాత విగ్రహం వద్ద జరపడం జరిగింది. ఈ సందర్భంగా మల్లాపూర్ మండలం అధ్యక్షుడు బోడ ప్రశాంత్ మాట్లాడుతూ బహుజనులకు అందరినీ ఒక్కతాటిపై నడిపించి బహుజనులు అందర్నీ రాజ్యాధికార వైపు అడుగులు వేసే విధంగా ప్రజలందరినీ చైతన్యం చేసిన గొప్ప పోరాటయోధుడు బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మాన్యశ్రీ కాన్షీరామ్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని రాబోయే కాలంలో బహుజనుల అందరిని ఏకతాటిపైకి చేసి రాజ్యాధికారం వైపు అడుగులు వేసే విధంగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి మోతే రమేష్, కార్యదర్శి నిఘా ఉదయ్, సెక్టార్ కమిటీ సభ్యులు తలారి నవీన్, అనుపట్ల దినేష్, గడ్చంద మహేష్, సుద్ధపల్లి అరవింద్, నరేష్, మహేష్, ఎర్ర శరత్, రణధీర్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: