కళ్యాణలక్ష్మీ పథకం పేదలకు వరం లాంటిది : మంత్రి చామకూర మల్లారెడ్డి
Published: Tuesday January 25, 2022
మేడిపల్లి, జనవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు వరం లాంటిదని కార్మికశాఖ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లతో కలిసి లబ్ది దారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు 2వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ డివిజన్లోని లబ్ధిదారునికి మంత్రి, మేయర్ చేతుల మీదుగా షాదీ ముబారక్ చెక్కును అందజేశారు.
Share this on your social network: