ఐఐఐ టి బాసర లో సీటు సాధించిన విద్యార్థికి ఆర్దిక సహాయం

Published: Thursday September 15, 2022
బోనకల్, సెప్టెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి ఐ ఐ ఐ టి బాసర లో సీటు సాధించిన భానోతు వరలక్ష్మికి హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టర్ వైవిడి నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో 5000 రూపాయలను బుధవారం విద్యార్థికి పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మోత్కూరి మధు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు యలమద్ధి వెంకటేశ్వర్లు ఆ పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం శ్రీ శ్రీనివాసరావు, చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వై.వి మాట్లాడుతూ వరలక్ష్మికి ఆరు సంవత్సరాలకు అయ్యే ఖర్చును వైవిడి నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో అందజేయనున్నట్లు తెలిపారు. ఐ ఐ ఐ టి లో సీటు సాధించిన వరలక్ష్మి మాట్లాడుతూ ఆర్థిక సహాయం అందించిన నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుజాత, బేబీ, మండల ఉపాధ్యాయులు రవి, రామ్మోహన్, శ్రీనివాస్, వెంకన్న, సీతారామారావు, లింగా, కేజీబీవీ ఎస్ ఓ కమలవాహిని, తదితరులు పాల్గొన్నారు.