కేశవపట్నంలో కంటి అద్దాలను పంపిణీ చేసిన ఎంపీడీవో శంకరపట్నం ఫిబ్రవరి 15 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Thursday February 16, 2023

శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటివెలుగు కార్యక్రమము లో బాగంగా బుధవారము ప్రిస్కైప్షన్ ద్వారా ఆర్డర్ చేసిన కంటి అద్దాలు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఖాజా బషీరొద్దిన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా.వేణుగోపాల్, ఈ ఎన్ టి సుమన్,  స్థానిక ఉప సర్పంచ్ గజ్జెల్లి హన్మంతు, పంచాయతీ కార్యదర్శి టీ. గురువయ్య, ఏఎన్ఎం శ్రీ వాణి, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.