హరిత తెలంగాణకు పాటుపడాలి

Published: Wednesday August 18, 2021

వలిగొండ, ఆగష్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్ మిడియేట్ విద్యాధికారి సంజీవ ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించి హరిత తెలంగాణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్  లక్ష్మీ కాంత్ కుమార్, ఎన్ సి సి అధికారి లెఫ్టినెంట్ విక్రమ్ బాబు, ఎన్ఎస్ఎస్ అధికారులు శ్రీరాములు, విజయ్ కుమార్, అధ్యాపకులు సోమశేఖర్,  మురళి, సైదా, గోపి, సురేష్, స్వప్న, ఎన్.సి.సి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.