హరిత తెలంగాణకు పాటుపడాలి
Published: Wednesday August 18, 2021
వలిగొండ, ఆగష్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్ మిడియేట్ విద్యాధికారి సంజీవ ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించి హరిత తెలంగాణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీ కాంత్ కుమార్, ఎన్ సి సి అధికారి లెఫ్టినెంట్ విక్రమ్ బాబు, ఎన్ఎస్ఎస్ అధికారులు శ్రీరాములు, విజయ్ కుమార్, అధ్యాపకులు సోమశేఖర్, మురళి, సైదా, గోపి, సురేష్, స్వప్న, ఎన్.సి.సి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: