రైతు వేదిక నందు రైతు విగ్రహాల ఆవిష్కరణ

Published: Wednesday November 17, 2021
విగ్రహాల దాత తాళ్ళూరి నాగేశ్వరరావు
బోనకల్, నవంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం గోవిందా పురం ఎల్ గ్రామంలో రైతు వేదిక నందు రైతు విగ్రహాలను ఆవిష్కరించిన తాళ్ళూరి నాగేశ్వరరావు, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా టిఆర్ఎస్ పార్టీ బోనకల్ మండలం నాయకులు కళ్యాణ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. తాళ్లూరి నాగేశ్వరరావు గోవిందాపురం నివాసి ప్రస్తుతం విజయవాడలో వ్యాపారం చేస్తూ తన సొంత గ్రామం పై మక్కువతో గోవిందా పురం గ్రామానికి రైతు వేదికలో రైతుల విగ్రహాలని బహుకరించారు. విగ్రహాల నిర్మాణ ఖర్చుకు కూడా సుమారు ఒక లక్ష ఇరవై వేలు రూపాయలు ఇచ్చి ఈ గ్రామ రైతులకు ఉపయోగపడ్డారు. అదేవిధంగా ఇంకా కొంతమంది వైద్య వేద ఉపయోగపడే లాగా ఉండాలని అని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ఏవో శరత్ బాబు, గ్రామ సర్పంచ్ ఉమ్మినేని బాబు, సహకార సంఘ అధ్యక్షులు మాది నేని వీరభద్రం, గోవిందాపురం గ్రామ రైతు బంధు అధ్యక్షులు వెనిగండ్ల మురళి, టిఆర్ఎస్ నాయకులు ఉమ్మ నేని కృష్ణ, రజక సంఘం రాష్ట్ర నాయకులు తమ్మారపు బ్రహ్మయ్య, కారంగుల చంద్రయ్య, ఏడునూతల లక్ష్మణ్ రావు, గుంటూరు సాయిబాబు, ఏ ఈ ఓ శ్రీకాంత్, తాళ్ళూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.