చలో హైదరాబాద్ - తరలివెళ్లిన పంచాయతీ కారొబార్ సిబ్బంది...
Published: Tuesday October 05, 2021
సారంగాపూర్, అక్టోబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ బీరుపూర్ మండలాలకు చెందిన పంచాయతీ కారొబార్ సిబ్బంది హైదరాబాద్ తరలివెళ్లారు. సోమవారం రోజున తలపెట్టిన సీఐటీయూ జాక్ ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ లోని సుందరయ్య పార్కులో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పులి మల్లేశం సయిండ్ల మల్లేశం ప్రధాన కార్యదర్శిలు మ్యాడ గంగరెడ్డి బోధనపు రంజిత్ కార్యవర్గ సభ్యులు గుండ గంగాధర్ గోపాల్ లింగమల్ల మల్లేష్ పట్టేం రమేష్ వికాస్ లక్ష్మన్ బేతి లక్ష్మన్ సంతోష్ గుమ్ముల రమేష్ సతీష్ సాధిక్ తరలివెళ్లిన వారిలో ఉన్నారు.
Share this on your social network: