తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే ఎస్పీ మోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ ,యువనేత బీపీ నా

Published: Saturday February 25, 2023
బోనకల్, ఫిబ్రవరి 24 ప్రజా పాలన ప్రతినిధి: బిజెపికి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణ, తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని ఎస్టి మోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్, వైరా అసెంబ్లీ నాయకులు బి పి నాయక్ అన్నారు. మండలంలోని గోవిందాపురం (ఎల్) గ్రామంలో గురువారం నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వైఫల్యలను ఎండగట్టిన ప్రభుత్వం బిజెపి అని, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రజలకు మరింత చేరువైందని. ప్రతి చోట ప్రజలందరూ ప్రేమాభిమానాలు పార్టీకి పంచుతూ భారీ మద్దతును తెలియజేస్తున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తప్పక భారతీయ జనతా పార్టీ రాబోతుందని డబుల్ ఇంజన్ సర్కార్ తో రామరాజ్య స్థాపన ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు బిజెపి మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, నాయకులు తాళ్లూరు సురేష్, జంపాల రవి తదితరులు పాల్గొన్నారు.