దెందుకూరు లో ఘనంగా సంక్రాంతి రోజున రైతు బంధు సంబరాలు

Published: Monday January 17, 2022
మధిర జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం దెందుకూరు గ్రామంలో రైతులు పండుగ అయిన సంక్రాంతి పండగ రోజున దెందుకూరు గ్రామంలో ఘనంగా రైతు బంధు సంబరాలు చేసి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతులు తమ సంతోషాన్ని తెలియచేసారు. గంగిరెద్దుల గజ్జల గలగలలు. కోడి పుంజుల కోట్లటాలు. రంగు రంగుల ముగ్గులతో. ఎడ్ల బండి పరుగులతో సంక్రాంతి శోభను సంబరాలు చేసి తెలియచేసారు. రైతులు పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధికి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దెందుకూరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ అల్లు రమాదేవి. రైతు కన్వీనర్ రాజేంద్రప్రసాద్. రైతు బంధు జిల్లా సభ్యులు చుంచువిజయ్. కొల్లూరి శ్రీను,అల్లు అంకబాబు, మాదాల శరత్, అమిరినేని వెంకటేస్వరరావు, బుగ్గవీటి కిరణ్, మువ్వా పురుషోత్తం, ఉద్దండు, రాములు, చుంచు శ్రీను, సిరబోయన సత్యం, గుర్రం భాస్కర్, గుర్రం అచ్ఛియ, గుర్రం మాధవరావు, గుర్రం వీరయ్యచౌదరి, బిట్టు రామారావు, గోపతి నరేష్ తదితరులు పాల్గొన్నారు