ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి ఆగస్టు 17: కొడంగల్ అంబెడ్కర్ చౌరస్తాలో. కొడంగల్ నియోజకవర్గ అంబేద

Published: Thursday August 18, 2022
ఉపాధ్యాయుడు మూడో తరగతి చదువుతున్న 9 సంవత్సరాల బాలుడు ఇంద్ర మెగావాల్ అనే బాలుడు దాహమేసి స్కూల్లో ఉన్న కుండలో నుంచి నీళ్లు తీసుకొని తాగడం చూసినా ఉపాధ్యాయుడు నీవు తక్కువ జాతి వాడవు అంటరానివాడు అని చిన్న పిల్లవాడు అని చూడకుండా అమానుషంగా ఆ పిల్లోనిపై అతి కిరాతకంగా మానవత్వం మర్చిపోయి దాడి చేయడం ఎక్కడపడితే అక్కడ కొట్టడం ఆ దేబ్బలు తాడుకోలేక ఆ పిల్లగాడు అప్పుడే అపస్మారస్థితికి చేరుకోవడం వెంటనే ఆసుపత్రికి తరలించిన గత 25 రోజులు ప్రాణాలతో పోరాడి ఆగస్టు 14 తారీఖున తుది శ్వాస విలవడం జరిగింది 75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ రోజుల్లో కూడా దళితులకు బీదవాళ్లకు ఇంకా నీళ్లు తాగే అర్హత కూడా లేకపోవడం ఎంత బాధాకరమని ఇంకా ఏ కాలంలో ఉన్నాము ఇంత ఘోర పరిస్థితిలో ఉన్నాము ఒకసారి ఆలోచించుకోవాలని ఇటువంటి మతోన్మాదులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కుల అసమాన తల పోరాట సమితి నాయకులు వెంకటయ్య కిష్టప్ప అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు చిన్నయ్య ఏసు చెన్నకేశవులు k. శివ శంకర్ కాశీనాథ్ md. జావిద్ తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area