జడ్పీ కో- ఆప్షన్ మెంబర్ మహమ్మద్ సలీం ఫాషకు ఘనంగా నివాళులు
Published: Thursday May 27, 2021
జగిత్యాల, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ కో- ఆప్షన్ మెంబర్ మహ్మద్ సలీం పాషా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రోజున మరణించిన సంగతి తెలిసిందే. అయన చిత్రపటానికి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ తెరాస పార్టీ ఒక మంచి నాయకున్ని కోల్పోయిందని ఆమె విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని చేకూర్చాలని సలీం పాషా ఆత్మకు శాంతి కలుగాలని జిల్లా ప్రజా పరిషత్ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు జడ్పిటిసి సభ్యులు నాగం భూమయ్య బత్తిని అరుణ సంగెపు మహేష్ బాధినేని రాజేందర్ జడ్పీ డిప్యూటీ సీఈవో సంధ్యారాణి మరియు జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: