మున్సిపల్ ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్రీధర్ ని కలిసిన ఎమ్మెల్యే డా. సంజయ్

Published: Tuesday August 02, 2022

జగిత్యాల, ఆగస్టు 01 ( ప్రజాపాలన ప్రతినిధి): హైదరాబాద్ లో మున్సిపల్ ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్రీధర్ ని వారి కార్యాలయం లో కలిసి జగిత్యాల మున్సిపల్ లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అదేవిధంగా పలు విభాగాల్లో ఇంజినీర్ అధికారుల కొరత ఉందని వాటిని వెనువెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని తద్వారా అభివృద్ధి పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంటుందని ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ కోరినారు. వెంట నాయకులు భోగ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.