కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరం లాంటిది మంత్రి మల్లారెడ్డి

Published: Saturday July 23, 2022

మేడిపల్లి, జూలై22 (ప్రజాపాలన ప్రతినిధి)

ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి కళ్యాణ్ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు వరం లాంటిదని కార్మికశాఖ మంత్రివర్యులు

చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లతో కలిసి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ మేరకు 5వ డివిజన్ కు చెందిన లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.