హథ్ సే హాథ్ జోడో గోడపత్రికను ఆవిష్కరించిన మానవతారాయ్
ఫిబ్రవరి 6నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే హాథ్ సే హాథ జోడో అభియాన్ ( చేయి చేయి కలుపుదామ్ అభయాన్ని ఇద్దాం) అనే గడప గడప కు కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించారు. పార్టీ మండల నాయకులు అనిల్ చౌదరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి చేసే హాథ్ సే హాథ్ జోడో పాద యాత్రలో సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలంతా పాల్గొని జయప్రదం చేయాలని మానవతారాయ్ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.సత్తుపల్లి నియోజకవర్గం లో ఫిబ్రవరి 4 న ఉదయం 8 గంటలకి సత్తుపల్లి మండలం రామనగరం బూత్ నెంబర్ 225,226 నుండి సత్తుపల్లి నియోజకవర్గం లోని మొత్తం 286 భూతుల్లో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో సందేశ లేఖ ను మోసుకుంటూ గడప గడప కు హాథ్ హాథ్ జోడో కార్యక్రామాన్ని తాను లాంచనంగా ప్రారంభిస్తున్నట్లు మానవతారాయ్ తెలిపారు.సత్తుపల్లి నియోజకవర్గం లో రెండు రోజులపాటు హాథ్ హాథ్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ఫిబ్రవరి 6 న ప్రారంభమయ్యే రేవంత్ రెడ్డి పాదయాత్ర కు సత్తుపల్లి నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు అడపా అనీల్ చౌదరి,తల్లాడ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లా ఆదినారాయణ యాదవ్,ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూక్య శివకుమార్ నాయక్,సత్తుపల్లి మాజీ ఎంపిటీసి ఐ.కృష్ణ, కొమ్మెపల్లి వార్డు మెంబర్ బాజి,కిన్నెర శ్రీనివాస్,శ్రీకాంత్,భరత్ బాబు,తేళ్ళపుట్ట లక్ష్మణరావు,తేళ్ళపుట్ట పుల్లారావు,నీళ్ళ సాగర్,విలాసాగరం వీరభద్రం ,తోట శ్రీకాంత్ పాల్గొన్నారు.తల్లాడ, జనవరి 29 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఆదివారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటారి మానవతారాయ్
Share this on your social network: