టిఆర్ఎస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం లో శంకరపట్నం నాయకులూ ప్రజాపాలన ప్రతినిధి 18 నవంబర్ శం
కరీంనగర్ లోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీ వి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉప అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ బిజెపి కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే సమాధానమని, జరుగుతున్న అభివృద్ధి సాక్ష్యమని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అలాగే కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా శంకరపట్నం, మానకొండూర్, గన్నేరువరం, తిమ్మాపూర్ మండలాల వందల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీని అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి శంకరపట్నం మండలం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, వైస్ ఎం పీ పీ పులికోట రమేష్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు రవి, కేశవపట్నం గ్రామ అధ్యక్షులు మేకల కుమార్, నాయకులు మేకల తిరుపతి, బొజ్జ రవి, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: