చౌటప్పల్ క్లస్టర్ ఇంచార్జీ గా రాయల నాగేశ్వరరావు నియామకం.
Published: Thursday September 15, 2022
పాలేరు సెప్టెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన క్లస్టర్ ఇంచార్జీగా పాలేరు నియోజకవర్గ నాయకులు రాయల నాగేశ్వరరావు ను నియమించారు. ఈ మేరకు మంగళవారం చౌటప్పల్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తనను ఇంచార్జీగా నియమించినందుకు రేవంత్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నేలకొండపల్లి లో విలేకర్ల సమావేశంలో రాయల నాగేశ్వరరావు మాట్లాడారు.... పీసీసీ ఆదేశాల మేరకు మునుగోడు లో కాంగ్రెస్ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు తెలిపారు. తన పై నమ్మకంతో అప్పగించిన ఇంచార్జీ బాధ్యత ను సమర్ధవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. చౌటుప్పల్ లో ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ ను అధిపత్యం లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మునుగోడు లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ఈ | I కార్యక్రమంలో తనగంపాడు సర్పంచ్ కేతినేని వేణు. నేలకొండపల్లి మండల
నాయకులు బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, మంకెన వాసు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: