కరోనా బాధితులకు అండగా ముగ్గురు 'వాసు'లు
Published: Wednesday May 26, 2021
కరోనా బాధితులకు ప్రతిరోజు వేడి వేడి ఆహారాన్ని పంపిస్తున్న మల్లాది వాసు వాసు, తేళ్ల వాసు, కర్లపూడి వాసు
మధిర, మే 25, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో కరోనా సోకిన బాధితులకు మల్లాది వాసు, తేళ్ల వాసు, కర్లపూడి వాసు, రెండు పూట్ల ఆహారాన్ని పంపించి పట్టణ ప్రజల ప్రశంసలు అందుకున్నారు. 20 రోజులుగా మల్లాది వాసు, వారం రోజులుగా కర్లపూడి వాసు, ఐదు రోజుల నుంచి తేళ్ల వాసు కరోనా బాధితులకు ఆహారాన్ని అందజేస్తున్నారు. కరోనా కష్టకాలంలో మధిర ప్రజలకు అండగా నిలిచిన ముగ్గురు వాసులకు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
Share this on your social network: