వయోవృద్ధులకు అనాథలకు ఆపన్న హస్తం

Published: Monday April 03, 2023
* మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ షకీల్
వికారాబాద్ బ్యూరో 02 ఏప్రిల్ ప్రజాపాలన :
ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు, అనాధలకు పండ్లు, జ్యూస్ గ్యాస్ సిలిండర్ లు పంపిణీ చేశామని వికారాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ షకీల్ అన్నారు. ఆదివారం  వికారాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు అఫ్జల్ షకీల్ ఆధ్వర్యంలో పండ్లు జూస్ ను పంపిణీ చేశారు. అనాధాశ్రమానికి గ్యాస్  సిలిండర్లను డొనేట్ చేసిన  సామాజిక కార్యకర్త మొహమ్మద్ అబిద్. ఇటీవలే చికిత్స పొందిన పాషాను పరామర్శించి పండ్లు అందజేసి భరోసానిచ్చిన మైనార్టీ నాయకులు. వికారాబాద్ టౌన్ లోని వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు, అనాధలకు పండ్లు పంపిణీ చేసిన మైనార్టీ నాయకులు. పేదవాడి ఆకలి తీర్చడంలో తమ వంతుగా పండ్లు పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త మొహమ్మద్ అబిద్ అనాధాశ్రమానికి గ్యాస్ సిలిండర్ లను దానం చేశారు. పేదలకు సహాయం చేయడంలో చాలా తృప్తి ఉంటుందని మైనార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు అఫ్జల్ షకీల్, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ పట్టణ వైస్ ప్రెసిడెంట్ ముర్తుజా అలీ, బీఆర్ఎస్ యువ నాయకులు మొహమ్మద్ సిద్ధిక్, సోషల్ వర్కర్ అబిద్ అలీ, మొహమ్మద్ ఉబేద్, హోమ్ గార్డ్ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.