మండలంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించిన డిఎల్పిఓ ప్రభాకర్ రావు

Published: Saturday December 17, 2022
జన్నారం, డిసెంబర్ 16, ప్రజాపాలన:  మండలములోని ధర్మారం, కలమడుగు గ్రామ పంచాయితిలను మంచిర్యాల జిల్లా విభాగ పంచాయతీ అధికారి డి ఎల్ పి ఓ ప్రభాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని ధర్మారం గ్రామ పంచాయితీ నందు తెలంగాణా క్రీడ ప్రాంగణము, నర్సరీ, పల్లె ప్రకృతి వనములను సందర్శించి పరిశీలించారు. అదేవిధంగా  కలమడుగు గ్రామ పంచాయితీలోని సమస్త రికార్డులను తనిఖీ చేశారు. గ్రామపంచాయతీలోని తెలంగాణా క్రీడ ప్రాంగణము, నర్సరీ, పల్లె ప్రకృతి వనములను, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించగారని ఆదేశించడమైనది. ఈ కార్యక్రమంలో జన్నారం మండల ఎంపీ ఓ రమేష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.