పురగిరి క్షత్రియ పెరిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
Published: Saturday December 17, 2022
జన్నారం, డిసెంబర్ 16, ప్రజాపాలన: పురగిరి క్షత్రియ పెరిక సంఘం మంచిర్యాల జిల్లా జన్నారం మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లం లచ్చన్న, జిల్లా నాయకులు కాండ్రపు భూమన్న, మచ్చ శంకరయ్య, ముత్యం రాజన్న, కానుగంటి లక్ష్మణ్ వర్మ ఆధ్వర్యంలో శుక్రవారం జన్నారం మండల అధ్యక్షుడు వెంబడి సత్యం, ఉపాధ్యక్షుడు మెాటపలుకులు లక్ష్మీనారాయణ, బియ్యాల రాజన్న, ప్రధాన కార్యదర్శి బెడద గోపాల్, కార్యదర్శులు కాండ్రపు మల్లేష్, అచ్చె వెంకటి, ముత్యం సుధాకర్, ప్రచార కార్యదర్శి శ్రీధర్ల రమేష్, ఆర్థిక కార్యదర్శి మెండి సురేష్, సలహాదారులు పూదరి బాపన్న, సభ్యులు బుద్ధె శ్రీనివాస్ కంచుల రమేష్ లను, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు అల్లం సురేష్, మండల నాయకులు బొలిశెట్టి భూమష్, పేరం మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: