బీసీ విద్యార్థి ఫోరు యాత్రను విజయవంతం చేయండి ** బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేష్ ** ప

Published: Saturday December 03, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 02 (ప్రజాపాలన, ప్రతినిది) : ఈనెల 20వ తేదీన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరగనున్న బీసీ విద్యార్థి యువజన ఫోరు యాత్రను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పోరు యాత్రకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ సారధ్యంలో ఈనెల 2 నుండి జనవరి 18 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన పోరు యాత్ర కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో బీసీ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని, పక్కాభవనాలు నిర్మించాలని, ఫీజు రియంబర్స్మెంట్ పెంచాలని, బీసీ రిజర్వేషన్లు పెంచాలని, ఇతర డిమాండ్లతో విద్యార్థి యువజన పోరు యాత్ర జరుగుతుందని, ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ కుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి పటేల్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, మాలి సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, ప్రశాంత్, గడ్డల ప్రణయ్, జూలూరి విలాస్, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.