మధిర బార్ అసోసియేషన్ కార్యాలయానికి ఎల్ఈడి టీవీ వితరణ

Published: Wednesday August 25, 2021
మధిర, ఆగష్టు 24, ప్రజాపాలన ప్రతినిధి : మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షులు భైరవబోట్ల శ్రీనివాసరావు తండ్రి భైరవబోట్ల శేషగిరిరావు జ్ఞాపకార్ధం మంగళవారం మధిర బార్ అసోసియేషన్ ఆఫీస్ కొరకు 43 అంగుళాల కలర్ టీవీని టాటా స్కై నెట్ వర్క్ సంయుక్తంగా బహుకరించారు. ఈ టీవీని అధ్యక్షులు భైరవభట్ల శ్రీనివాసరావు మరియు సోదరుడు వెంకట రమణారావు సమక్షంలో బార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మధిర బార్ అసోసియేషన్ ఆఫీసుకు పెద్ద మనసుతో టీవీ బహుకరించిన బార్ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారిని బార్ సభ్యులు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, దేవరపల్లి సుబ్రహ్మణ్యం, ఈవీ.ప్రభాకర్, కావూరి రమేష్, దిరిశాల జగన్మోహన రావు, వెంకట్రావు, విజయ కుమార్, నంబూరి జనార్ధన రావు, సతీష్, జింకల రమేష్, సుంకు మోహన్ దాస్, బొజేడ్ల పుల్లారావు, నెల్లూరి రవి తదితరులు బార్. అసోసియేషన్ అభినందించారు