ఎంపీ సంతోష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డివిజన్ అధ్యక్షులు ఎండీ ముస్తాక్

Published: Wednesday December 08, 2021
మేడిపల్లి, డిసెంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్లో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రామంతాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎండీ ముస్తాక్ ఎంపీ సంతోష్ కుమార్ ను ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి పూల మొక్కను అందజేశారు.అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎండి ముస్తాక్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జగదీష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.