కార్పొరేటర్ పల్లె ప్రజల ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు

Published: Saturday October 01, 2022

జవహర్ నగర్ (ప్రజాపాలన ప్రతినిధి) :పట్టణ ప్రగతి లోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్  కార్పొరేటర్ పల్లపు రవి తమ డివిజన్లోని బి.జె.ఆర్ నగర్ లో  స్థానికులు డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్డుపై పారుతుండగా వర్షానికి రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని కార్పొరేటర్ కు తెలియజేయడంతో జనరల్ ఫండ్ లో నుండి 4 లక్షల రూపాయలు కేటాయిస్తూ 110 మీటర్ల పొడవు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ విచ్చేసి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు మరియు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడవ డివిజన్ కార్పొరేటర్ మెట్టు ఆశాకుమారి మెట్టు వెంకన్న ఆరవ డివిజన్ యువత అధ్యక్షుడు పల్లపు ప్రశాంత్, మాజీ వార్డు సభ్యురాలు పల్లపు ఉపేంద్ర, పల్లపు నరసింహ, శ్రీహరి, కృష్ణ, చంద్రమౌళి చారి, కళావతి, నరేందర్, రవీందర్ గౌడ్, కొండయ్య, కార్యకర్తలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.