ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Monday February 20, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి)

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను రామంతాపూర్లో శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో  రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి, డాక్టర్ బి వి చారి, మేకల ముత్యం రెడ్డి, నంది కంటి శివ, కనకయ్య, శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బాలరాజు యాదవ్, రాపోలు సాయినాథ్, మాజీ అధ్యక్షులు సిహెచ్ హరీష్, కొత్తపల్లి రమేష్, జిల్లా శ్రీనివాస్, నగేష్ గుప్తా,  సోమ శ్రీనివాస్, కులకర్ణి నాగరాజు, యాదగిరి, సాగర్, జగదీష్, రోషన్, నీలకంఠ, బాలాచారి, అరవింద్,  ప్రవీణ్ యాదవ్ భారీ ఎత్తున హిందూ బంధువులు పాల్గొన్నారు.