ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్

Published: Wednesday February 16, 2022

రాయికల, ఫిబ్రవరి 15 ప్రజాపాలన ప్రతినిధి : రాయికల్ పట్టణంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారుల ఇంటికి సైకిల్ పై వెళ్లి చెక్కులను వారికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదవారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చైర్మెన్ మోర హనుమాన్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, వార్డు కౌన్సిలర్లు కన్నాక మహేందర్, ఎలిగేటి అనిల్ కుమార్, తురఘశ్రీధర్ రెడ్డి, సాయి కుమార్ కాంతారావు, ముబిన్ టిఆర్ఎస్ రాయికల్ మండల ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్, ఇంతియాజ్ రాయికల్ మండలం యూత్ ప్రెసిడెంట్ మోర రామ్మూర్తి, లక్ష్మి పతి రావు, లింగం గౌడ్, పెరుమండ్ల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.