హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలి
Published: Tuesday January 10, 2023
జన్నారం, జనవరి 9, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పల్లె ప్రగతి లో భాగంగా రాబోయే సంవత్సరం హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలని సోమవారం ఎంపీడీవో అరుణారాణి సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న పల్లె ప్రగతి నర్సరీని పరిశీలించారు. గ్రామపంచాయతీ నర్సరీలో మొక్కలను సందర్శించి సుందరంగా తీర్చిదిద్దాలని ఆమె తెలిపారు .పల్లె ప్రగతి హరితహారం లో భాగంగా నర్సరీలలో కొత్త మొక్కల, పండ్ల మొక్కలను పెంపకానికి నర్సరీ సిబ్బంది ప్రత్యేక సిద్ద తీసుకోవాలని ఆమె సూచించారు. నర్సరీలలో నాటిన మొక్కలను నీరు పోసి సంరక్షించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రవీందర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తిమ్మాపూర్ సర్పంచ్ జాడిగంగాధర్, గ్రామ కార్యదర్శి లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: