అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి : కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్
Published: Wednesday April 28, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : హబ్సిగూడ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ అధికారులకు సూచించారు. డివిజన్ పరిధిలోని కాకతీయనగర్, పిఎస్ కాలనీ, జై సంతోష్ నగర్, మధురనగర్లలో జరుగుతున్నటువంటి అండర్ గ్రౌండ్ వర్షపు నీరు మరియు డ్రైనేజి మరియు అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ అధికారులతో కలిసి కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ పర్యటించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డివిజన్లో జరుగుతున్నటువంటి అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, డిఈ నాగమణి, ఏఈ కీర్తీ పాల్గొన్నారు.
Share this on your social network: