బార్వాద్ గ్రామంలో అంబరాన్నంటిన క్రిస్మస్ వేడుకలు

Published: Monday December 26, 2022
*: కాంగ్రెస్ నాయకుల యస్.ఆనందం
వికారాబాద్ బ్యూరో 25 డిసెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటిన విధంగా ఘనంగా జరిగాయి. పిన్నలు పెద్దలు మహిళలు  సంతోషంగా ప్రార్థన చేస్తూ మందిరంలో గడిపారు. ఏసుక్రీస్తుకు  సంబంధించిన లఘునాటికలు ప్రేక్షకులను అలరించాయి. కరుణామయుడు శాంతి దూత ఏసుప్రభువు గురించి విశిష్ట వాక్యాలను పాస్టర్ రాజు భక్తులకు వివరించారు. కరోనాతో దేశంలోని ప్రజలు ఎంతో నష్టపోయారని ఆవేదన చెందారు.    ఏసుక్రీస్తు ఎంతో గొప్ప దేవుడని ప్రజల విశ్వాసం అని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొన్నాయిల  ఆనందం మాట్లాడుతూ ముందుగా గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ దయ శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి సదా ఆచరణీయమని కొనియాడారు. క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా  గ్రామంలో ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఏసుప్రభువు ఆశీర్వాదాలు పొందుతూ ప్రతి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా బతకాలని సూచించారు.