చేవెళ్ల నియోజకవర్గం బ్యూరో న్యూస్ -1

Published: Friday October 28, 2022
మోడీ దిష్టిబొమ్మ దహనం 
 
 చేవెళ్ల నియోజకవర్గం (బ్యూరో )
తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర కొనుగోలు చేయడానికి బరితెగించిన బిజెపి ప్రధాని మోడీ వైఖరిని నిరసన చేస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్య ఆధ్వర్యంలో గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం  చేశారు. బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు బిజెపి తీరుపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు  కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల మండల్ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శేరి శివారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.