సేవాలాల్ జయంతి సందర్భంగా బ్యాడ్మింటన్ పోటీలు

Published: Monday February 14, 2022
ప్రారంభించిన సర్పంచ్ భూక్యా సైదా నాయక్
బోనకల్, ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని గిరిజన కాలనీలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకొని బాడ్మింటన్ క్రీడాపోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ క్రీడాపోటీలను సర్పంచ్ భూక్యా సైదానాయక్, మేఘ శ్రీ హాస్పటల్ వైద్యులు ఎల్ గంగాధర్ గుప్తా, బిజేపీ యువమోర్చా మండల అధ్యక్షులు కాలసాని పరుశురాంలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సైదానాయక్ మాట్లాడుతూ క్రీడలు మానసీక ఉల్లాసానికి తోడ్పాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రీడలు ఆడాలని సూచించారు. సేవాలాల్ జయంతి సందర్భంగా క్రీడాపోటీలను నిర్వహించిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకులు ఎన్ఆర్ఐ బిపీ నాయక్, భూక్యా రమేష్ నాయక్, భూక్యా సైదులు, భూక్యా ఉపేంద్ర, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.