పుల్కల్ మండలం లో మన ఊరు మన బడి పనులను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా

Published: Thursday June 16, 2022
హైదరాబాద్ 15 జూన్ ప్రజాపాలన: మన ఊరు మన బడి పనులను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా .
సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా బుధవారం నాడు   పుల్కల్ మరియు చౌటకూర్ మండలాల లోని పలు  పాఠశాలలో మన ఊరు మన బడి పథకం కింద మంజూరైన పనులను తనిఖీ చేశారు. పనులను వేగవంతం చేయాలని సంబంధిత విధ్యాకమిటి చైర్మన్ మరియు సర్పంచ్ లను ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభం అయినవి పనులు ఇంకా పూర్తి చేయలేదు విద్యార్థులకు ఇబ్బంది కరంగా ఉందన్నారు. మరమ్మతు పనులను తొందరగా పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధిత గ్రామ సర్పంచులు విద్యాకమిటి చైర్మన్ లు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.