తుమ్మలపల్లిలో శివాజీ విగ్రహం ఆవిష్కరణ

Published: Thursday January 19, 2023
* మర్పల్లి మండల జెడ్పిటిసి మధుకర్
వికారాబాద్ బ్యూరో 18 జనవరి ప్రజా పాలన : తుమ్మలపల్లి గ్రామంలో శివాజీ విగ్రహం ఆవిష్కరించామని మర్పల్లి మండల జడ్పిటిసి మధుకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ చరిత్రను నేటి యువత చదవాలని సూచించారు. హిందూ సామ్రాజ్య విస్తరణకు ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించారని గుర్తు చేశారు. శత్రుమూకలను తుదముట్టించేందుకు పకడ్బందీగా సైన్యాన్ని రూపొందించుకున్నాడని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు క్యాసారం మల్లేశం, సర్పంచులు మల్లేశం, పాండు, ఇందిర అశోక్, మిత్ర తుమ్మల పల్లి తెరాస నాయకులు కర్నె రాజు, రాచీరెడ్డి, దత్తు, మల్లేశం గ్రామస్తులు పాల్గొన్నారు.