హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Published: Wednesday April 28, 2021

పటాన్చెరు, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్చెరు పట్టణంలోని సరాయి హనుమాన్ మందిరంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టాడిలో భాగంగా ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జయంతి వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు.