ఏకగ్రీవంగా కమ్మసంఘం నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా సంకురాత్రి సతీష్
అశ్వారావుపేట (ప్రజాపాలన ప్రతినిధి :)అశ్వారావుపేట కమ్మసంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నూతన అధ్యక్షుడిగా సంకురాత్రి సతీష్, ప్రధాన కార్యదర్శిగా తలశిల బాలకృష్ణ, కోశాధికారిగా ఈదర రాంమోహన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వచ్చే రెండేళ్లు ఈ సంఘం తమ సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, కమ్మ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం తమ శక్తి మేరకు కృషి చేస్తామని అధ్యక్షులు సంకురాత్రి సతీష్ తెలిపారు. అధ్యక్షులుగా సంకురాత్రి సతీష్, ఉపాధ్యక్షులుగా దమ్మలపాటి శ్రీనివాసరావు గుమ్మడవల్లి, ప్రధాన కార్యదర్శిగా తలశిల బాలకృష్ణ, అశ్వారావుపేట, కోశాధికారిగా ఈదర రాంమోహన్ కావడిగుండ్ల, సహాయ కార్యదర్శి గా కాకర్ల వెంకటేశ్వరరావు పాపిడిగూడెం,అల్లూరి నవీన్ గంగారం, కార్యవర్గ సభ్యులుగా పిచ్చికల నరేంద్ర శ్రీనివాస్ నారంవారిగూడెం, కొండెపాటి కోటిబాబు మేడిపల్లి, దేవరపల్లి సురేష్ మల్లాయిగూడెం, ఆళ్ల కిషోర్ అచ్చుతాపురం, నెక్కంటి దుర్గ రాంప్రసాద్, ముళ్ళపూడి నాగేంద్ర, కోడూరి శ్రీనివాస్ లను ఎన్నుకోవడం జరిగింది.
Share this on your social network: