ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 26ప్రజాపాలన ప్రతినిధి.
Published: Saturday August 27, 2022
చెరుకూరి రాజు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
బీఎస్పీ పార్టీలో వీకే ప్రసాద్
పార్టీని మరింత వేగవంతం చేయాలి*
ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో మంచాల మండంలోని చెన్నారెడ్డి గూడ గ్రామ బహుజన నాయకుడు వికే ప్రసాద్ బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జి పల్లాటి రాములు మరియు జిల్లా నాయకులు చెరుకూరి రాజు ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరారు, బీఎస్పీ రాష్ట అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో మాత్రమే బహుజన ప్రజల జీవితాలు మారుతాయని బహుజన రాజ్యం కోసం నేను పనిచేస్తానని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మచ్చ మహేందర్, సుధాకర్ రెడ్డి , భరత్ మిగత సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: