పాఠశాలకు కంప్యూటర్ వితరణ

Published: Wednesday December 14, 2022
బోనకల్, డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలకు ఆ గ్రామానికి చెందిన పారుపల్లి నరసింహారావు సోదరి మందడపు భద్రమ్మ భర్త ఇటీవల కాలంలో మరణించారు వారి జ్ఞాపకార్థం వారి కూతురు సమతా 30 వేల రూపాయలు విలువ చేసే కంప్యూటర్ లను పాఠశాలకు వితరణ చేశారు. మరికొద్ది రోజులలో ప్రింటర్ కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికిరణ్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోతు రామకృష్ణ,పాఠశాల సిబ్బంది, గ్రామ సర్పంచ్ రవీందర్, గ్రామ పెద్దలు పారుపల్లి నరసింహారావు, పి.పుల్లారావు, రంజాన్ ,అలీ, రామకృష్ణ అన్నపూర్ణాదేవి తదితరులు పాల్గొన్నారు.