పంచాయతీ సిబ్బంది, పాలకవర్గానికి ఆనందయ్య కరోనా మందు పంపిణీ

Published: Friday August 06, 2021
బోనకల్లు, ఆగస్టు 05, ప్రజాపాలన ప్రతినిధి : పంచాయతీ సిబ్బంది సేవలు భేష్. సర్పంచ్ చిలక వెంకటేశ్వలు  నెల్లూరుజిల్లా కృష్ణపట్నం నుంచి తెచ్చిన ఆనందయ్య కరోనా మందును బోనకల్ మండలం జానకీపురం గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులుకు మల్టీపర్పస్ వర్కర్స్ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు గ్రామ సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగడుపున మందును తీసుకోవడం ఆహార నియమాలు, మూడు నాలుగు రోజుల వరకు ఏ విధంగా పాటించాలి, అదేవిధంగా రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా వలాభాలు తెలియజేశారు. అలాగే తీవ్రమైన కరోనా వ్యాపించిన సమయంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఆహారం అందించడం కరోనాసోకి మరణించిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించి ఆరోగ్యగ్రామంగా నిలిపి సేవలు అందించిన పంచాయతీ సిబ్బందికి మరియు పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛందంగా సర్పంచ్ వారికి వారి కుటుంబ సభ్యులకు మందును పంపిణీ చేసినందుకు సంతోషం వ్యక్తంచేస్తూ వార్డుసభ్యులు సిబ్బంది సర్పంచ్ కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామకార్యదర్శి గోపీచంద్ పాల్గొన్నారు